వరంగల్ జిల్లా : వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇవాళ మరో ఆరుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు ఎంజీఎంలో 25 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. పీరియాడిక్ వార్డులో నలుగురు చిన్నారులు, కోవిడ్ ప్రత్యేక వార్డులో మరో ముగ్గురు చికిత్స తీసుకుంటున్నారు. మిగతా వాళ్లకు హోం ఐసోలేషన్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. నిన్న, ఇవాళ ల్యాబ్ కు పంపిన 12 శాంపిల్స్ పెండింగ్ లో ఉన్నాయని డాక్టర్లు తెలిపారు.