బీజేపీ అగ్రనేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుబట్టారు. జైల్లో ఉండాల్సిన అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం చేపట్టాలని ఎల్కే అద్వానీ ప్రారంభించిన రథయాత్ర మత కల్లోలాలు సృష్టించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
అద్వానీకి భారతరత్న ప్రకటన తర్వాత దేశ ప్రజలకు బీజేపీ ప్రభుత్వం ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటుందని ప్రశ్నించారు. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 30-35 స్థానాల్లో సీపీఐ పోటీ చేస్తుందని నారాయణ వెల్లడించారు. ఇండియా కూటమిలో అన్ని పార్టీలను కలుపుకుని పోవాలని కాంగ్రెస్కు సూచించారు.