ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎంఎస్ ధోనీ మరో ఘనత సాధించాడు. 250 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన తొలి క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. ఇందులో 220 మ్యాచ్లు సీఎస్కే (చెన్నై సూపర్ కింగ్స్) తరఫున ఆడగా.. రైజింగ్ పుణె సూపర్ జెంట్స్ తరఫున 30 గేమ్స్ ఆడాడు. దీంతోపాటు ఐపీఎల్ హిస్టరీలో 11 ఫైనల్స్ ఆడిన తొలి ఆడగాడిగా కూడా ధోనీ రికార్డు నమోదు చేయడం విశేషం.
ధోనీ తర్వాత రోహిత్ శర్మ 243 మ్యాచ్లతో రెండో స్థానంలో.. దినేశ్ కార్తిక్ 242 మ్యాచ్లు, విరాట్ కోహ్లీ 237 మ్యాచ్లు, రవీంద్ర జడేజా 225 మ్యాచ్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. తాజాగా సాధించిన 5వ ఐపీఎల్ ట్రోపీతో కెప్టెన్ గా రోహిత్ రికార్డును ధోనీ సమం చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో సోమవారం రాత్రి అహ్మదాబాద్లో జరిగిన ఐపీఎల్ 2023 ఫైనల్ ఉత్కంఠభరిత పోరులో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించిన విషయం తెలిసిందే.