Friday, May 10, 2024

కేంద్రం తీరు కోర్టు ధిక్కారమే..

spot_img

ఢిల్లీలో అధికారుల బదిలీ విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కోర్టు ధిక్కారమే అవుతుందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‎కి వ్యతిరేకంగా మద్దతు ఇవ్వాలని సీతారాం ఏచూరిని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోరారు. అందులో భాగంగానే సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేతలు.. సీతారాం ఏచూరితో భేటి అయ్యారు.

కేజ్రీవాల్ విజ్ఞప్తికి సీతారాం ఏచూరి కూడా సానుకూలంగా స్పందించారు. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని సీపీఐ(ఎం) నిర్ణయించింది. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను ఖండిస్తున్నామని ఏచూరి స్పష్టం చేశారు. ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధం, కోర్టు ధిక్కారమే అని ఆయన నొక్కివక్కానించారు. మన రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ముందుకు రావాలని కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Latest News

More Articles