Wednesday, May 1, 2024

రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో నిరాశ

spot_img

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు రాష్ట్ర హైకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్న ‘వ్యూహం’ చిత్రం విడుదలను ఆపేయాలని టీడీపీ యువనేత నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ నెల 11వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. సినిమా సెన్సార్ సర్టిఫికెట్ పై స్టే విధించింది.

ఈ నేపథ్యంలో.. ‘వ్యూహం’  నిర్మాత హైకోర్టు డివిజన్ బెంచ్ లో మరో పిటిషన్ వేశారు. తాజా పిటిషన్ లో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేశారు. సినిమా విడుదల కాకపోవడంతో తమకు కోట్ల రూపాయల నష్టం వచ్చిందని కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ధర్మాసనం సింగిల్ బెంచ్ లోనే తేల్చుకోవాలని పిటిషనర్ కు సూచించింది.

ఇది కూడా చదవండి: గార్డెన్‎లో పూలు కోసినందుకు ముక్కు కోసిన యజమాని

Latest News

More Articles