సూర్యపేట జిల్లా కేంద్రం సమీపంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారంఉదయం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మోతేకు దగ్గరలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. మరో తొమ్మిది మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 12 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. వారంతా కూలి పనులకోసం వెళ్తుండగా ప్రమాదం బారినపడినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: కామారెడ్డి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొట్టిన బైకు.. ఇద్దరు దుర్మరణం.!