Sunday, April 28, 2024

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో వేలాది ఎకరాలు ఎండిపోతున్నయ్

spot_img

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. ఒక్క దేవరుప్పులలోనే వందలాది బోర్లు వేశారు.. రైతులు అప్పుల పాలయ్యారన్నారు. ఇవాళ(ఆదివారం) జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ మంత్రి దయాకర్ రావుతో కలిసి పర్యటించారు హరీశ్ రావు.  ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు హరీశ్ రావు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. దేవాదుల ద్వారా పంపింగ్ చేసి నీళ్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎన్నికల హామీల్లో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు. అప్పుడు అరచేతిలో స్వర్గం చూపెట్టి ఇప్పుడు మొండి చేయి చూపిస్తున్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటింది. వందరోజులైనా హామీలు నెరవేర్చక ప్రజలను మోసం చేసింది. కాంగ్రెస్ ఒక్క రూపాయి రుణమాఫీ చేసింది లేదు. రైతు బంధు రూ. 15 వేలు ఇస్తామన్నారు.. కానీ రూ. 10 వేలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. రైతులు కొత్తగా బోర్లు వేసి అప్పుల పాలవుతున్నారు. రైతు బంధు కౌలు రైతులకు కూడా ఇస్తామని వాళ్ళను కూడా మోసం చేసింది. రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేసిఆర్ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారు.. రెండు పంటలు పండాయి. ఇప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియడం లేదని రైతులు అంటున్నారు. కాంగ్రెస్ అడుగడుగునా రైతులను మోసం చేసిందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని తెలిపారు హరీశ్ రావు. సీఎం,మంత్రులకు రైతులను ఓదార్చే ఓపిక లేదన్నారు హరీశ్ రావు. రైతులు పిట్టల్లా రాలిపోతుంటే ముఖ్యమంత్రి, ఒక్క మంత్రి కూడా పరామర్శించిన పాపాన పోలేదన్నారు. ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుల ఇళ్లకు వెళ్లడానికి.. మా ఎమ్మెల్యేలను గుంజుకునేందుకు టైం ఉందన్నారు. మీరు తెరవాల్సింది రాజకీయ పార్టీ గేట్లు కాదు.. ప్రాజెక్టుల గేట్లు తెరిచి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎకరానికి రూ. 25 వేల పంట నష్ట పరిహారం ఇవ్వాలి. దేవరుప్పులలో రైతు సత్తమ్మ నాలుగు బోర్లు వేసి కన్నీటి పర్యంతమవుతున్నారని తెలిపారు. ఊరికి వంద బోర్లు వేసుకుంటున్నారు. సీఎం, మంత్రులు హైదరాబాద్ లో రాజకీయాలు మాని.. వ్యవసాయ క్షేత్రాలు వచ్చి పంట పొలాలను పరిశీలించి రైతుల్లో ధైర్యం నింపాలని సూచించారు. పండిన కొద్ది పంటను రూ. 500 బోనస్ ఇవ్వాలి.. లేకుంటే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. కాంగ్రెస్ కు రైతులు గుణపాఠం చెబుతారన్నారు. అవసరమైతే రాబోయే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని తెలిపారు. ఛలో సెక్రటేరియట్ కు పిలుపునిస్తామన్నారు హరీశ్ రావు. కేసిఆర్ ఉన్నపుడు మంచి నీళ్లు ఇచ్చే వచ్చాయి. 10 రోజుల నుంచి మంచి నీళ్లు రావడం లేదంటున్నారు. 4 నెలలు కాలేదు మంచి నీళ్లు ఇవ్వలేకపొతున్నారని విమర్శించారు హరీశ్ రావు.

ఇది కూడా చదవండి: యూట్యూబ్‌ ఛానళ్లపై కేటీఆర్‌ సీరియస్‌

Latest News

More Articles