Friday, May 3, 2024

రైతుల కోసం సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

spot_img

నేటి నుంచి సాగర్ ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని నాగార్జునసాగర్ ఆయకట్టు కింద సరైన వర్షాలు కురవకపోవడం వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. దాంతో ఆ ప్రాంతాల రైతాంగం, శాసనసభ్యులు, మంత్రులు గత నాలుగైదు రోజుల నుంచి ముఖ్యమంత్రికి పలు విజ్ఞప్తులు చేస్తున్న నేపథ్యంలో… ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో సాగర్ ఎడమ కాలువ కింద వరి పంటలకు సాగునీరు అందించే విషయంపై చర్చించారు.

Read Also: నర్సుల గౌరవం పెంచిన తెలంగాణ ప్రభుత్వం.. ఇక నుంచి వారందరూ..

తెలంగాణ వాటా కింద కృష్ణా జలాలలో మన నీరు ఉన్న నేపథ్యంలో, రేపటి నుండి నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఉన్న వరి పొలాలకు నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మరో 20 రోజుల తర్వాత మరో తడి కోసం నీటిని విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారు.

Read Also: కానిస్టేబుల్ కొలువుల జాతర.. ఒక్కో ఇంట్లో ముగ్గురు, నలుగురికి జాబ్స్

వానలు లేక సాగర్ రిజర్వాయర్‎లో ఆశించిన మేరకు నీటి నిల్వలు లేని కారణంగా, సాగునీటిని ఒడుపుగా పొదుపుగా వాడుకొని వరి పంటను కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ రైతాంగానికి పిలుపునిచ్చారు. సాగర్ ఎడమ కాలువ నీళ్లు విడుదల చేస్తున్న నేపథ్యంలో.. ఆయా జిల్లాల మంత్రులు, శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాలలో పర్యవేక్షిస్తూ, రైతుల చివరి పొలాలకు, చివరి ఆయకట్టు దాకా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.

Latest News

More Articles