Sunday, April 28, 2024

నేను ఢిల్లీ వెళ్లడంలేదు.. స్మితా సబర్వాల్

spot_img

హైదరాబాద్: బీఆర్ఎస్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వంలో కీలక అధికారిణిగా స్మితా సబర్వాల్ పనిచేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఆమె.. మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి పథకాలను పర్యవేక్షించారు. ఇపుడు తెలంగాణ రాష్ట్రాన్ని వీడనున్నట్టు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక బాధ్యతల నుంచి స్మితాను తప్పించనున్నారని, అందువల్ల ఆమె డిప్యుటేషన్‌‍పై కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్మిత ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు. తాను సెంట్రల్ సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లడం అనేది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ తాను రాష్ట్రంలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానని తెలిపారు.

Latest News

More Articles