ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 స్టార్-స్టడెడ్ ప్రారంభ వేడుకతో షురూ కానుంది. ఐపీఎల్ 2024 ప్రారంభ వేడుకలో గాయకులు ఏఆర్ రెహమాన్, సోనూ నిగమ్లతో పాటు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కూడా ప్రదర్శన ఇవ్వనున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్తో ప్రారంభమవుతుంది. చెన్నైలోని ఎం చిదంబరం క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. దీనికి ముందు, ప్రారంభ వేడుకలో చాలా మంది స్టార్స్ మైదానంలో ప్రదర్శన ఇవ్వబోతున్నారు.
ఐపీఎల్ 2024 మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (CSK vs RCB) మధ్య చెన్నైలోని M చిదంబరం క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఐపీఎల్ సోషల్ మీడియాలో IPL 2024 ఓపెనింగ్ సెర్మనీ గురించి సమాచారాన్ని అందిస్తూ ఒక పోస్ట్ను షేర్ చేసింది. ఇందులో పెర్ఫార్మింగ్ స్టార్ల జాబితా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ కంటే ముందు ఫిబ్రవరి 22 న చెన్నైలో వేడుక జరుగుతుందని పేర్కొంది.
The stage is set, the lights are bright, and the stars are ready to shine at the #TATAIPL 2024 Opening Ceremony! 🎉🥳
Get ready for an unforgettable fusion of cricket and entertainment ft. a stellar lineup! ✨
🗓22nd March
⏰6:30 PM onwards pic.twitter.com/7POPthFITx— IndianPremierLeague (@IPL) March 20, 2024
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ఐపీఎల్ 2024 ప్రారంభ వేడుకలో సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. ‘బడే మియాన్ ఛోటే మియాన్’ సినిమా విడుదలకు ముందే జనాల్లో వార్తల్లో నిలిచింది. అక్షయ్, టైగర్ కాకుండా, ఆస్కార్ అవార్డు గ్రహీత రెహమాన్, సోను నిగమ్ కూడా ప్రారంభ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు ఐపీఎల్ షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ వ్యవధిలో 17 రోజుల్లో 21 మ్యాచ్లు జరగనున్నాయి.
ఇది కూడా చదవండి: వైద్యారోగ్య శాఖలో 5,348 పోస్టుల భర్తీకి..ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్.!