Sunday, April 28, 2024

వైద్యారోగ్య శాఖ‌లో 5,348 పోస్టుల భ‌ర్తీకి..ఆర్థికశాఖ గ్రీన్ సిగ్న‌ల్.!

spot_img

తెలంగాణలోని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో భారీగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు శాఖల్లో కలిసి మొత్తం 5,348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఈనెల 16వ తేదీనే ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి జీవో రిలీజ్ చేశారు. ప్రజారోగ్యం, ఆయుష్, డీసీఏ, ఐపీఎం, డీఎంఈ, వైద్య విధాన పరిషత్, ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతులను జారీ చేసింది. ఈ నియామకాలు వైద్యారోగ్య సర్వీసుల నియామక బోర్డు ద్వారా నేరుగా చేపట్టనున్నారు. దీనికోసం స్థానికత ఆధారంగా ఉన్న ఖాళీలు, రోస్టర్ పాయింట్లు,అర్హతకు సబంధించిన వివరాలను ఆయా విభాగాల అధిపతుల నుంచి తీసుకోవాలని తెలిపారు. ఆయా వివరాల ఆధారంగా నోటిఫికేషన్ ఇచ్చి నేరుగా ఖాళీలను భర్తీ చేయాలని తెలిపారు.

ఇది కూడా చదవండి: కేంద్ర మంత్రి సభలో పవర్‌ కట్‌..జనరేటర్లతో మీటింగ్ పూర్తి..!

Latest News

More Articles