Saturday, April 27, 2024

కేంద్ర మంత్రి సభలో పవర్‌ కట్‌..జనరేటర్లతో మీటింగ్ పూర్తి..!

spot_img

కాంగ్రెస్ సర్కార్ హయాంలో కరెంటు కోతలు నిత్యకృత్యాలుగా మారాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కరెంటు కోతలు ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా కేంద్రమంత్రి పాల్గొన్న ఓ కార్యక్రమంలోనూ ఇదే రిపీట్ అయ్యింది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సుంకిడి, ఉండం గ్రామాల్లో బుధవారం కేంద్రమంత్రి అర్జున్ ముండా పర్యటించారు.

ఉండం గ్రామంలోని ఆయేషా గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన కార్యక్రమంలో అర్జున్ ముండా మాట్లాడుతుండగా హఠాత్తుగా కరెంటు పోయింది. కేంద్రమంత్రి కంటే ముందు ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్థన్ మాట్లాడుతుండగా మైక్ కట్ అయ్యింది. దాదాపు అరగంట సేపు కరెంటె పోయింది. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో కాంగ్రెసోళ్లు కావాలనే కరెంట్ కట్ చేశారని బీజేపీ నాయకులు, కార్యకర్తలు సెటైర్లు వేశారు. ఇక చేసేదేమీ లేక జనరేటర్ల సహాయంతో కార్యక్రమాన్ని కొనసాగించారు.

ఇది కూడా చదవండి: లక్నోకు షాక్ మరో ఇంగ్లీష్ పేసర్ దూరం.!

Latest News

More Articles