హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మలక్ పెట్ లో నిర్మించిన ప్యాకేజ్ 9 లో మొదటి పంప్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ట్రయల్ రన్ విజయవంతం కావడంపై ఇంజనీర్లు, నీటిపారుదల శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
అమెరికా పర్యటనలో భాగంగా నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యతను వివరించిన మినిస్టర్ కేటీఆర్ కు ఇది గిఫ్ట్ అని ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతం అంటూ నిన్న విశ్వనగరం అమెరికాలో కేటీఆర్ వివరించారు.
తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఇంజినీర్ల సేవలను ఆ సందర్భంగా మంత్రి కేటీఆర్ కొనియడారు. ఈ సందర్భంగా ఇంజనీర్లు, నీటిపారుదల శాఖ అధికారులు కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.