Sunday, April 28, 2024

బీఆర్ఎస్ ఓటమి మన మంచికే.. కాంగ్రెస్ నికృష్ట పాలన జనాలకు అర్ధమవుతుంది

spot_img

ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ లోని VNR గార్డెన్ లో బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. జోష్ ఫుల్ గా సాగిన ఈ మీటింగ్ లో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. ‘ఉప్పల్ లో జోష్ చూస్తుంటే అధికారంలో మనం ఉన్నామా? కాంగ్రెసోడు ఉన్నాడా అర్దం కావటం లేదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి లో గెలుపు మనదే. కాంగ్రెస్ ను మల్కాజ్ గిరి లో మడత పెట్టీ కొట్టుడే. 420 హామీలు చూసి జిల్లాలో జనం మోసపోయారు. కాంగ్రెస్ మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదని జనం తెలుసుకున్నారు.

100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ను బొంద పెట్టుడే. రేవంత్ రెడ్డి మాట్లాడే భాషను జనం చూసి అసహ్యించుకుంటున్నరు. చిన్నపెద్ద తేడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. లంకె బిందెలు కోసం దొంగలు తిరుగుతారు. గతంలో రేవంత్ రెడ్డి అదే కావచ్చు నాకైతే తెలియదు. రేవంత్ రెడ్డి లాగా మేము తిట్టగలుతాం. మొన్నటి ఫలితాలు మన మంచికే వచ్చాయి అనుకుంటున్న. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది. నికృష్ట కాంగ్రెస్ పాలన జనానికి తెలుస్తుంది’ అని అన్నారు కేటీఆర్.

Latest News

More Articles