Tuesday, May 7, 2024

స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్ నడిపే యువకులకు కేటీఆర్ గుడ్‎న్యూస్

spot_img

స్విగ్గిస్ జొమాటో, ఓలా , ఉబర్ మరియు ఇతర పార్ట్ టైం ఉద్యోగాలు చేసే యువకుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు తెలిపారు. వారు సేవలు అందిస్తున్న కంపెనీలతో మాట్లాడి ఈ ఉద్యోగులకు ఆరోగ్య బీమా, ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలను అందించడంతోపాటు జాబ్ సెక్యూరిటీని కల్పించేలా చూస్తామన్నారు. రాష్ట్రంలో సుమారు మూడు లక్షలకు పైగా యువకులు ఈ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారన్నారు.

ప్రజలకు అనేక రకాల సేవలు అందిస్తున్న వీరి సంక్షేమాన్ని చూసుకోవడం ప్రభుత్వాల బాధ్యత అని, ఈ దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత అధికారంలోకి రాగానే ఈ గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వ అధికారులు కంపెనీ ప్రతినిధులు గిగ్ వర్కర్ల ప్రతినిధుల తో కలిపి ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ బోర్డులో ఒక లీగల్ సెల్ వ్యవస్థతోపాటు, ఈ యువకులకు కంపెనీల తరఫున ఎదురయ్యే న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొనేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం చేస్తున్న డెలివరీకి కొంత సొమ్ము అందుకుంటున్న పద్ధతితోపాటు వీరికి కనీస జీతాలను అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

రాష్ట్రంలో భారీగా పెరిగిన ఐటీ ఉద్యోగాలు మరియు ఇతర రంగాల్లో జరిగిన కంపెనీల విస్తరణ తర్వాత గిగ్ వర్కర్లకుభారీ డిమాండ్ ఏర్పడిందని దీంతో ఎవరిపైన ఆధారకుండా వీరు సంపాదించుకోగలుగుతున్నారని వీరి సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామన్నారు. కేటీఆర్ తో జరిగిన చర్చల సందర్భంగా తమకు ఎదురవుతున్న పలు ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పలు కంపెనీలు తమ కు అందించే ఫీజులను ఏమాత్రం పెంచడం లేదని పైగా ఇన్సెంటివ్ లను తీసివేశారని తెలిపారు. ఈ కంపెనీ ప్రతినిధులతో తాను స్వయంగా మాట్లాడి ఈ అంశంలో వీరికి సానుకూలంగా నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Read Also: అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు అలర్ట్.. కొత్త రూల్స్ తీసుకొచ్చిన ఎంబసీ

ప్రభుత్వమే స్వయంగా ఫుడ్ డెలివరీ, క్యాబ్ బుకింగ్ మరియు ఇతర ఆన్లైన్ సేవలకు సంబంధించిన ఒక ప్రత్యేక ఆప్ ని ఏర్పాటు చేస్తే తమకు ఉపయుక్తంగా ఉంటుందని పలువురు తెలిపిన ప్రతిపాదనపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే ఇలాంటి ఒక వ్యవస్థ కేరళలో ప్రారంభమైందని దానిపైన ఆధ్యాయయనం చేసి మరింత మెరుగులు దిద్ది తెలంగాణలోని అమలు చేస్తామన్నారు. గిగ్ వర్కర్ల సమస్యల పైన ప్రత్యేకంగా స్పందించి సావధానంగా విని తమ అంశాలను అర్థం చేసుకొని సానుకూలంగా స్పందించిన కేటీఆర్ కి గిగ్ వర్కర్ల ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. తమ సంక్షేమం పట్ల సానుకూలంగా స్పందించి తమకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన భారత రాష్ట్ర సమితికి ఈ ఎన్నికలు అండగా నిలబడతామని తెలియజేశారు.

Latest News

More Articles