Saturday, April 27, 2024

మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిలు మళ్ళీ కేసీఆర్ కాళ్లు పట్టుకున్న పార్టీలోకి రానీయం

spot_img

కేకే, కడియం ఇలాంటి నాయకులు పార్టీ కష్ట కాలంలో వదిలిపెట్టి వెళ్తున్నారు. పోయే నాయకులు వెళ్లేటప్పుడు కొన్ని రాళ్లు వేసి వెళ్తారు… వాళ్ళు చేస్తున్న విమర్శలపైన వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను… కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందన్నారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడిన కేటీఆర్…ఈరోజు నాయకులు పార్టీని వదిలేసినా… పార్టీ శ్రేణుల కోసం నేను స్వయంగా పనిచేస్తా. ఇన్ని రోజులు పార్టీ కోసం, నాయకుల కోసం పనిచేసిన కార్యకర్తల కోసం నేను స్వయంగా వస్తా. రానున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో గెలిపించుకుంటా అని హమీ ఇస్తున్నా. రంజిత్ రెడ్డి పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరారు. 2014లో విశ్వేశ్వర్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఎంపీగా చేసినం. 2019లో రంజిత్ రెడ్డి పార్టీని వదిలి కాంగ్రెస్లో చేరితే చేవెళ్ల ప్రజల చైతన్యంతో ఓడిపోయారు. కేసీఆర్ కూతురు అరెస్ట్ అయిన రోజు నవ్వుకుంటూ కాంగ్రెస్లోకి పోయిన రంజిత్ రెడ్డి,పట్నం మహేందర్ రెడ్డిల పైన మన పార్టీ కార్యకర్తలు పగ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిలు మళ్ళీ వచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్న పార్టీలోకి రానీయం. మల్కాజిగిరిలో పోటీ చేయాలని సీఎం కు విసిరిన సవాలుపై స్పందించలేదు. ఆయన సొంత సిట్టింగ్ ఎంపీ స్థానంలోనే పోటీకి వెనకంజ వేసిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సీట్లను గెలిపిస్తామని అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి లీకువీరుడుగా మారిండు. ఎన్నికల హమీలపై ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకే ఈ డ్రామాలు. రైతులకు రుణమాఫీ, 4000 పించన్లు, 2500 మహిళలకు, అందరికీ ఉచిత కరెంటు ఇలాంటి అన్ని హమీలు తుంగలో తొక్కిన్రు. ఆరు గ్యారంటీలు పోయినవి, ఆరు గారఢీలు మిగిలినవి. రాష్ర్టంలో ఏవర్గం ఈ రోజు కాంగ్రెస్ పాలనలో సంతోషంగా ఉన్నారో చెప్పాలి. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇయ్యాలి. రేవంత్ 5ఏండ్లు ప్రభుత్వంలో ఉండు.. నీ 420 హమీలు నేరవేర్చు… నీకు నల్లగొండ, ఖమ్మం నాయకులే మానవబాంబులైతరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఅర్ఎస్ బీజేపీ బీ-టీమ్ అన్నారు. కానీ ఎన్నికల తర్వతా రేవంత్ రెడ్డి బీజేపీ బీ-టీమ్ గా మారిండన్నారు.

రేవంత్ రెడ్డి.. రాహుల్ రెడ్డికోసం పనిచేస్తున్నారా, మోడీ కోసమా చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. దేశంలో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్ల కన్నా ఎక్కువ వచ్చే పరిస్ధితి లేదన్నారు. బీజేపీని అపేందుకు బలమైన స్ధానిక నేతలే అని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే, అది బీజేపీకి లాభం అవుతుందన్నారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు… పార్టీకి అండగా ఉండేందుకు ముందుకు వచ్చిన గొప్ప నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అని అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అని తెలిపారు. ఆయన కేవలం రంగారెడ్డి మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితుడన్నారు. రాష్ట్రంలో బలహీన వర్గాలకు ముఖ్యంగా ముదిరాజులకు అనేక సేవలు చేసిన నాయకుడు జ్ఞానేశ్వర్ అన్నారు. చేవెళ్లలో నిలబడ్డది కాసానికి జ్ఞానేశ్వర్ కాదు కేసీఆర్ అన్నట్టుగానే పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతుక కేసీఅర్ బలోపేతం చేయాలని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీసీలకు అత్యధిక స్ధానాలు ఇచ్చిన పార్టీ బీఅర్ఎస్ అని తెలిపారు. 13 తేదీన  జరిగే చెవెళ్ల పార్లమెంట్ మీటింగ్ కు ప్రతి ఒక్కరు తరలిరావాలని పిలుపు నిచ్చారు.

చేవెళ్ల నియోజకవర్గం లో గెలుస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలలో గెలిచే మొదటి స్థానం కచ్చితంగా చేవెళ్లదే అని తెలిపారు కాసాని జ్ఞానేశ్వర్. కొన్ని దశాబ్దాలుగా సమాజంలోని సంబండ వర్గాల కోసం నా చేతనైనంత మేరకు సేవ చేశాను. వారంతా ఇప్పటికే తనకు మద్దతు ఇస్తామని తెలియజేస్తున్నారు. ఎన్నికల్లో తనను ఆశీర్వదించి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి  చేస్తున్నానని అన్నారు కాసానికి జ్ఞానేశ్వర్.

ఇది కూడా చదవండి: 6 గ్యారంటీలు అమలుచేసే వరకు అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తం

Latest News

More Articles