Wednesday, May 8, 2024

మణిపూర్‎లో కాల్పులు..కుకీ మిలిటెంట్ల దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం .!

spot_img

మణిపూర్ లో అల్లర్లు ఆగడం లేదు. తాజాగా కుకీ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలోని నరన్‌సేన వద్ద మోహరించిన CRPF జవాన్లపై మిలిటెంట్లు దాడి చేశారు. శనివారం రాత్రి జవాన్లు నిద్రిస్తుండగా..ఒక్కసారిగా కుకీ ఉగ్రవాదులు వారిపై దాడికి పాల్పడ్డారు. మణిపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు సైనికులు సిఆర్‌ఎఫ్‌పికి చెందిన 128 బెటాలియన్‌కు చెందినవారు. వీరిలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కూడా ఉన్నారు. ఇతర సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మృతి చెందగా, ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. దీని తర్వాత, తీవ్రంగా గాయపడిన హెడ్ కానిస్టేబుల్ కూడా మరణించాడు.

ఇది కూడా చదవండి :JEE మెయిన్స్ ఆలిండియా టాపర్ రైతు బిడ్డ.!

Latest News

More Articles