పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు అగ్రహీరో అల్లు అర్జున్. పుష్పరాజ్ పాత్ర దేశవ్యాప్తంగా మాస్, యూత్ ఆడియన్స్ కు చేరువయ్యారు. దీంతో పుష్ప 2 మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం విడుదలైన టీజర్ సోషల్ మీడియా వీక్షణల్లో రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సినిమాపై నెలకొన్న హైప్ దృష్ట్యా థియేట్రికల్, ఓటీటీ బిజినెస్లు భారీ డీల్తో ముగిసాయంటున్నారు.
275కోట్లకు డిజిటల్ హక్కులు అమ్ముడుపోయాయన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే అల్లు అర్జున్ పారితోషికం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాలీవుడ్ సర్కిల్లో వైరల్ అవుతోంది. పుష్ప 2 మూవీకి అల్లు అర్జున్ దాదాపు 150కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే దేశీయ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న అతికొద్ది మంది హీరోల్లో ఒకరుగా బన్ని రికార్డు క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పుష్ప2 మూవీ స్యాతంత్ర్య దినోత్సవం బహుమతిగా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది కూడా చదవండి: మణిపూర్లో కాల్పులు..కుకీ మిలిటెంట్ల దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం .!