Thursday, May 9, 2024

శబరిమలలో మకరజ్యోతి దర్శనం

spot_img

శబరిమల: ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. జ్యోతిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది అయ్యప్ప భక్తులు తరలివచ్చారు.

Also Read.. కన్నుల పండగగా శ్రీగోదాదేవి అమ్మవారి కళ్యాణం

తిరువాభరణ ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో సాయంత్రం 6 గంటల సమయంలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. ఆ వెంటనే స్వామియే శరణం అయ్యప్ప.. నామస్మరణతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేరళ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Latest News

More Articles