మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం తీవ్రం అవుతున్నది. మరాఠా నేత మనోజ్ జరాంగే పాటిల్ తాజాగా బీజేపీ-షిండే ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు. నాలుగు రోజుల్లోగా రిజర్వేషన్లపై ప్రకటన చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Read Also.. టీచర్ పోస్టుల భర్తీపై ‘అంధజ్యోతి’ అసత్య కథనం..!!
మంగళవారం జాల్నా జిల్లాలోని అంతర్వాలి సారథిలోని ఉద్యమం శిబిరంలో జరాంగేను మంత్రుల బృందం కలిసింది. ప్రభుత్వానికి నెల సమయం ఇవ్వాలని కోరారు. అయితే కాలయాపన కుదరదని, నాలుగు రోజుల్లోగా తేల్చాల్సిందేనని, రిజర్వేషన్లపై ప్రకటన చేయాల్సిందేనని జరాంగే వారికి స్పష్టం చేశారు. మరోవైపు జరాంగే నిరాహార దీక్ష బుధవారంతో తొమ్మిదో రోజుకు చేరింది.