Sunday, April 28, 2024

ఎన్టీఆర్‎కు నిజమైన రాజకీయ వారసుడు సీఎం కేసీఆరే

spot_img

తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడు ఎన్టీఆర్ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా హనుమకొండలోని ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మర్నేని రవీందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ‘విశ్వ విఖ్యాత నటుడిగా, పరిపాలనాదక్షుడిగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ పేదల పెన్నిధి. రెండు రూపాయలకే కిలో బియ్యం, పేదలకు ఇళ్లు ఇచ్చారు. ఎందరో యువతకు ఆదర్శంగా నిలిచిన నేత. ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం. ఎన్టీఆర్‎కు నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ మాత్రమే. వారి ఆశయాలను సీఎం కేసీఆర్ పాటిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్నారు. వారి ఆశయాలను కొనసాగించడమే ఆయనకీ మనమిచ్చే ఘనమైన నివాళి’ అని అన్నారు.

Latest News

More Articles