కడుపులు కొట్టడమే తప్ప, మరే మంచితనం కనుచూపు మేరలో కనిపించని ఈ రోజుల్లో నిరుపేదలు, కూలీల కడుపులు నింపే కార్యక్రమం చేపడుతున్న ఎర్రబెల్లి ట్రస్టు సేవలు శ్లాఘనీయమని రాష్ట్ర ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కొనియాడారు. ట్రస్టును విజయవంతంగా నడిపిస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , ఉషా దయాకర్ రావు దంపతులను అభినందించారు.
పాలకుర్తి నియోజకవర్గంలో 70వేలకుపైగా ఉన్న ఉపాధి హామీ కూలీలకు లంచ్ బాక్స్, స్టీల్ వాటర్ బాటిల్, సెల్ ఫోన్ వంటి వస్తువులు పెట్టుకోవడానికి వీలుగా తయారు చేసిన బ్యాగ్ (Bag) ను ఉచితంగా అందజేసే కార్యక్రమాన్ని సోమవారం హైదరాబాద్లోని జీహెచ్ఎంసీలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రజల సేవే పరమావధిగా పనిచేస్తు వినూత్న సేవలందిస్తున్నారని ప్రశంసించారు.