Saturday, April 27, 2024

సినీ నటుడు నవీన్ పోలిశెట్టికి అమెరికాలో యాక్సిడెంట్

spot_img

‘జాతిరత్నాలు’ ఫేమ్ నవీన్ పోలిశెట్టికి అమెరికాలో యాక్సిడెంట్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నవీన్ అమెరికాలో ఉన్నారు. అమెరికా వీధుల్లో బైక్ పై వెళ్తున్న సమయంలో స్కిడ్ అయి కింద పడిపోయినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో నవీన్ చేతికి ఫ్రాక్చర్ అయిందని చెపుతున్నారు. గాయం తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండటంలో రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు  సమాచారం. ఈ నేపథ్యంలో కొంత కాలం పాటు షూటింగులకు నవీన్ దూరంగా ఉండబోతున్నారు. మరోవైపు ఈ వార్తపై నవీన్ లేదా ఆయన టీమ్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

చివరిగా విడుదలైన నవీన్ చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమాలో అనుష్కతో కలిసి నవీన్ నటించాడు. పి.మహేశ్ బాబు నటించిన ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబట్టింది. ప్రస్తుతం నవీన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి:సన్ రైజర్స్ గెలుపుతో కావ్య పాప ఫుల్ ఖుషీ..!

Latest News

More Articles