ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఏకంగా 277 పరుగులు చేసి భారీ స్కోర్ చేసింది. దీంతో ఆరెంజ్ ఆర్మీ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. అభిమానులు సైతం కాలర్ ఎగరవేస్తూ సంబురాలు చేసుకున్నారు. స్టేడియం అంతా సన్ రైజర్స్ పేరు మారుమ్రోగింది. సోషల్ మీడియా వేదికగా అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు.
ఇక సన్ రైజర్స్ జట్టు యాజమాని కావ్య ఆనందం అందర్నీ ఆకట్టుకుంది. తొలి మ్యాచులో హైదరాబాద్ పోరాడి ఓడింది. తమ జట్టు ఓటమితో ఆ రోజు స్టేడియంలో కావ్య సైలెంట్ గా కనిపించింది. తమ బౌలర్లు ఎక్కువ పరుగులు ఇచ్చిన సమయంలో బ్యాటర్లు ఔట్ అయిన సందర్భంగా కావ్య చాలా మూడీగా కనిపించింది.
Happiest person today on a planet Earth !!❤️
Kavya Maran you beauty🫶🏻#SRHvsMi | #SRHvMI | What a catch | #RohitSharma𓃵 pic.twitter.com/3wahB3hlv4
— ★ 𝐈𝐍𝐃𝐈𝐀𝐍 CIRCULAR PAGE 🇮🇳 (@mrfaisu721847) March 27, 2024
అయితే ఇప్పుడు ముంబై తో జరిగిన మ్యాచుతో హైదరాబాద్ చేసిన విధ్వంసానికి కావ్య ఒక్క నిమిషం కూడా కుదురుగా కూర్చలోేదు. ప్రతి ఫోర్ కు , సిక్సర్ కు లేచి కేరింతలు కొట్టింది. చప్పట్లు కొడుతూ తెగ ఎంజాయ్ చేసింది. కొన్ని సందర్భాల్లో ఎగిరి గంతులేసింది. తమ ప్లేయర్లు ఊచకోత కోస్తుంటే మరింత ఎంకరేజ్ చేస్తూ స్టాండ్ లో కూర్చుండి రచ్చ రచ్చ చేసింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇది కూడా చదవండి : ఐపీఎస్ అధికారి భార్యకు కాంగ్రెస్ టికెట్..ఈసీ ఏమన్నదంటే.!