Thursday, May 9, 2024

కోల్ కతాపై పంజాబ్ ఘనవిజయం..8 వికెట్ల తేడాతో గెలుపు.!

spot_img

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచులో పంజాబ్ అద్భుతంగా గెలిచింది. కోల్ కతా నిర్దేశించిన 262 పరుగుల టార్గెట్ ను పంజాబ్ 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జానీ బెయిర్‌స్టో, శశాంక్ సింగ్ అద్భుత బ్యాటింగ్ కారణంగా 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో జానీ బెయిర్‌స్టో 108 పరుగులు, శశాంక్ సింగ్ 68 పరుగులు, ప్రభసిమ్రాన్ సింగ్ 54 పరుగులు చేశారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్ కతా 6 వికెట్లకు 261 పరుగులు చేసింది. ఈ విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో 8వ స్ధానంలోకి అడుగుపెట్టింది. కోల్ కతా స్థానంలో ఎలాంటి మార్పు లేదు. ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా జానీ బెయిర్ స్టో నిలిచారు.


ఇది కూడా చదవండి: విషాదం..చేతికి వచ్చిన పంట ఎండిపోవడంతో ఓ రైతు ఆత్మహత్య.!

Latest News

More Articles