బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తరహాలోనే ప్రవీణ్ కుమార్ సైతం మడమ తప్పడని.. మాట ఇస్తే కట్టుబడి ఉండాల్సిందేనని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇవాళ( సోమవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఎస్పీకి చెందిన నేతలు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బలమైన తెలంగాణ వాదానికి బహుజన వాదం కలిస్తే బాగుంటుందని లోక్సభ ఎన్నికల కోసం పొత్తు కుదుర్చుకున్నట్లు తెలిపారు.
పొత్తు రద్దు చేసుకోవాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఒత్తిడి తెచ్చారన్నారు. అయితే, ఇది తనకు ఇష్టం లేదన్నారు. కేసీఆర్ మాదిరి ప్రవీణ్కుమార్ కూడా మడమ తిప్పడని.. మాట ఇస్తే మాటకు కట్టుబడి ఉండాలనే బీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. నీది పాలమూరే.. నాది పాలమూరే అనుకుంటూనే రేవంత్రెడ్డి తనను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి నేను గొర్రెలమందలో ఓ గొర్రెను కాలేను.. మా కార్యకర్తలు ఆర్థికంగా పేదలు కావచ్చు.. కానీ సైద్ధాంతికంగా పేదలు కాదన్నారు. నలుమూలలు తిరిగి బహుజన వాదాన్ని ప్రచారం చేస్తామని.. వీళ్లందరినీ రక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రవీణ్ కుమార్ .
ఇది కూడా చదవండి: ప్రజాసేవ కోసమే బీఆర్ఎస్లోకి..