Friday, May 10, 2024

బండికి పిచ్చి పట్టింది.. గుండు అరవింద్ నయాపైసాకు పనికి రాడు

spot_img

హైదరాబాద్: బండి సంజయ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.. బండి సంజయ్ భాష ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయిలో లేదు.. పంట నష్టంపై బండి వ్యాఖ్యలు అర్థరహితం, హాస్యాస్పదంగా ఉన్నాయని ఆర్టీసీ చైర్మన్- ఎమ్మెల్యే బాజి రెడ్డి గోవర్ధన్ అన్నారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘బండి వ్యాఖ్యలు దొంగే దొంగ అన్నట్టుగా ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఏం చేస్తున్నారో చెప్పి ఇక్కడ మాట్లాడాలి. సీఎం కేసీఆర్ ఫీల్డ్ కు వెళ్లడం లేదంటున్న బండికి కండ్లు, చెవులు లేవా. కేసీఆర్ ఖమ్మం వెళ్లి పంట నష్టం చూడలేదా. కేసీఆర్ వెళ్లొచ్చిన తర్వాత పంట నష్టానికి సంబంధించి 151 కోట్ల రూపాయలను హరీష్ రావు మొన్ననే విడుదల చేశారు.

వాట్సాప్ యూనివర్సిటీ ల్లో అబద్దాలు ప్రచారం చేస్తూ బీజేపీ పబ్బం గడుపుతోంది. రైతులకు కేసీఆర్ ఇప్పటివరకు 4.50 లక్షల కోట్ల మేర ఖర్చు చేశారు. మోడీ రైతులకు ఏం చేస్తున్నారో బండి ప్రశ్నించాలి. బండికి తెలివి ఉంటే రైతులకు అదనంగా మరో పది వేలు ఇప్పించాలి.

రైతుల గురించి బీజేపీ కి మాట్లాడే హక్కు లేదు. బీజేపీ కి వ్యక్తిగత ఆరోపణలు చేయడం తప్ప ఏదీ చేతకాదు. బీజేపీ అబద్దాలు మాట్లాడి ఎన్ని రోజులు బతుకుతుంది. దేశ ప్రజలు బీజేపీకి శిక్ష విధించడం ఖాయం. ఎంపీ గుండు అరవింద్ కూడా నయా పైసా కు పనికి రాడు. అబద్దాలు తప్ప అరవింద్ కు ఏం రావు. ఎకరాకు 30 వేలు డిమాండ్ చేయడం కాదు బండి సంజయ్ కు చేతనైతే కేంద్రం నుంచి  పది వేలు ఇప్పించాలి.

తెలంగాణ లో బీజేపీ నేతలు తప్ప ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు. బీజేపీ అబద్దాలు మోసాలు ప్రతి ఊరు లో ఎండగడుతాం. కేసీఆర్ సచివాలయం కడితే తప్పు..మోడీ పార్లమెంటు కడితే ఒప్పా. బీజేపీ నేతల తీరు చూసి ప్రజలు ఛీ కొడుతున్నారు. బండి సంజయ్ కు పిచ్చి లేచింది.. తక్షణమే పిచ్చి ఆస్పత్రి లో చేర్పించాలి.’’ అని బాజి రెడ్డి గోవర్ధన్ సూచించారు.

Latest News

More Articles