రంగారెడ్డి జిల్లాలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. షాద్ నగర్ నియోజవర్గం కొత్తూరు మండలంలో గంజాయి చాక్లెట్ల విక్రయం కలకలం సృష్టిస్తోంది. కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రవర్తనలో మార్పు కనిపించడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంగోర్ నాయక్ జిల్లా విద్యాశాఖ అధికారికి, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిఘా పెట్టిన ఎస్ఓటి పోలీసులు కొత్తూరులోని కిరాణా షాపుల్లో, రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన కిరాణా డబ్బాలలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో చార్మినార్ గోల్డ్ పేరిట పసుపు, బంగారు వర్ణంలో గల సుమారు 8 కేజీల గంజాయి చాక్లెట్ ప్యాకెట్లు పట్టుపడ్డాయి. చాక్లెట్లను విక్రయిస్తున్న ఒడిస్సా రాష్టానికి చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకీ తీసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. గంజాయి చాక్లెట్ల విక్రయ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు, కొత్తూరు ఇన్స్పెక్టర్ నర్సింహా రావు తెలిపారు. కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
Read Also: టీవీ షోలో ఛాన్స్ ఇప్పిస్తానని ఓయో రూమ్కు తీసుకెళ్లి..