Friday, May 10, 2024

ఢిల్లీ చేతుల్లోకి వెళ్లిన తెలంగాణ‌ను మ‌ళ్లీ తెచ్చుకుందాం

spot_img

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో బీఆర్ఎస్ అత్య‌ధిక స్థానాలు కైవ‌సం చేసుకోవ‌డం త‌థ్యమ‌ని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో స్ప‌ల్ప తేడాతోనే అధికారం చేజార్చుకున్నామ‌ని, ప్ర‌జ‌ల‌లో కూడా బీఆర్ఎస్ ఓట‌మి త‌ర్వాత సానుభూతి గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని చెప్పారు. తెలంగాణ భవన్‌లో బుధ‌వారం వరంగల్‌ పార్లమెంట్‌ సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశానికి వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధులు హాజరయ్యారు.

Read Also: స్కూల్ విద్యార్థులకు గంజాయి చాక్లెట్ల అమ్మకం.. క్లాస్ రూమ్‎ల్లో వింత ప్రవర్తన

ఈ సందర్బంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపు. శాసనసభ ఎన్నికల్లో కలిసి మాట్లాడుకునే అవకాశం రాలేదు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాం. తల్లడిల్లి ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు చల్లగా కాపాడుకున్నాం. కొన్ని తప్పిదాల కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందాం. ఇప్పుడు తెలంగాణ మళ్లీ ఢిల్లీ నేతల చేతుల్లోకి వెళ్లింది. మన తెలంగాణ మన చేతుల్లోకి తెచ్చుకునే సమయం ఆసన్నమైంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు, ప్రజలు ఆలోచిస్తున్నారు. తెలంగాణ గళం, బలం ఢిల్లీలో వినప‌డాలంటే మనం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం ఉన్నది. సమీక్షా సమావేశంలో మీకు మాట్లాడే అవకాశం ఇస్తున్నాం. మీరు చెప్పిన ప్రతీ అభిప్రాయం నోట్ చేసుకుంటాం’ అని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము చేసిన కొన్ని తప్పిదాల​ వల్లే ఓటమి చెందినట్టు ఈ స‌మావేశంలో ఆయ‌న ఒప్పుకున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బీఆర్‌ఎస్‌ ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.

Latest News

More Articles