Sunday, April 28, 2024

రూ. 10వేలకే శాంసంగ్ 5జీ మొబైల్..బంపర్ ఆఫర్ మీకోసం..

spot_img

మీరు 5జీ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా. బ్రాండెడ్ కావాలనే ఆలోచన చేస్తుండవచ్చు. అది కూడా 10వేలలోపు వస్తే బాగుండ అని అనుకుంటున్నారా. అయితే ఇది మీకు నచ్చుతుంది. దీని ఫీచర్స్ కూడా బాగున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎం 15 5జీ స్మార్ట్ ఫోన్. ఇది 4జీబి ర్యామ్, 128జీబీ స్టోరేజీ స్పేస్ తో వస్తుంది. ఈ ఫోన్ బ్యాటరీ 6000ఎంఏహెచ్ ఉంది. అలాగే 5ఎన్ఎం ప్రొసెసర్ 2వ జనరేషన్ ది ఉంది. ఓఎస్ ను కూడా అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. 4ఏండ్లు సెక్యూరిటీ అప్ డేట్ ఉంది. ఇంకా ర్యామ్ ను 12జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 13 రన్ అవుతుంది. ఈ ప్రొడక్టుకి ఛార్జర్ మాత్రం ఇవ్వలేదు. ఈ మొబైల్ కు ఉన్న Exynos 1330 Octa Core 2.4GH 5nm processor చాలా పవర్‌ఫుల్ అని అంటున్నారు. ఈ మొబైల్‌కి వన్ యూఐ 5.0 ఇంటర్‌ఫేస్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉన్నాయి. ప్రైమరీ కెమెరా 50మెగాపిక్సెల్ ఉండగా.మిగతా రెండు 2మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ఫ్రంట్ వైపు 13మెగాపిక్సెల్ కెమెరాఉంది. ఈ ఫోన్ బ్యాటరీకి ఏడాది పాటు గ్యారెంటీ కూడా ఉంది. అలాగే ప్రొడక్టుకు 6 నెలల గ్యారెంటీ ఉంది.

ఈ ఫోన్ అసలు ధర రూ.17990 కాగా.. దీనిపై అమెజాన్‌లో 44 శాతం డిస్కౌంట్ ఉంది.. దీన్ని రూ.9,990కి సేల్ చేస్తున్నారు. ఈ ఫోన్‌కి 4/5 రేటింగ్ ఉంండగా.. ఇప్పటికే 20 వేల మంది దాకా కొనుగోలు చేశారు.

ఇది కూడా చదవండి: ధోని ఎప్పటికీ ధోనీనే..హార్దిక్ పరువు తీసిన స్టార్ క్రికెటర్.!

Latest News

More Articles