Wednesday, May 1, 2024

ధోని ఎప్పటికీ ధోనీనే..హార్దిక్ పరువు తీసిన స్టార్ క్రికెటర్.!

spot_img

ఐపీఎల్ 2024- 17వ సీజన్ లో ముంబయి ఓటమితో కొత్త కెప్టెన్ హార్ధిక్ పాండ్యను అంతా టార్గెట్ చేశారు. మాజీ క్రికెటర్ల నుంచి ఫ్యాన్స్ వరకు ప్రతిఒక్కరూ పాండ్యపై ఫైర్ అవుతున్నారు. ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబయి ఇండియన్స్ ఈ సీజన్లో ఓటమితో ఆరంభించింది. ముంబయి ఓటమితో కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యను ఫ్యాన్స్ చాలా మంది క్రికెటర్లు టార్గెట్ చేశారు. తాజాగా ఈ లిస్టులో టీమిండియా స్టార్ బౌలర్ షమీ కూడా చేరాడు. మొదట్నంచీ హార్దిక్ తీరు నచ్చని షమీ..హార్దిక్ పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాడు. హార్దీక్ వ్యూహంపై ఫైర్ అవుతున్నాడు. ముంబయి ఓటమి గురించి గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు చేశాడు.

హార్దిక్ పేలవమైన వ్యూహంతో బరిలోకి దిగాడంటూ వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో హార్దిక్ ఏడోస్థానంలో రావడంపై షమీ విమర్శించాడు. ధోనిలా ఆ స్థానంలో వచ్చి మ్యాచ్ ను ముగించడం అందరికీ సాధ్యం కాదన్నారు. ధోనీ ఎప్పుడూ ధోనీనే..అతనిలా ఎవరూ మ్యాచ్ చేయలేరు. ధోని అయినా, కోహ్లీ అయినా ఒక్కో ఆటగాడి మైండ్ సెట్ ఒక్కోలా ఉంటుంది. మన నైపున్యాలు, ఆలోచనా ధోరణికి తగినట్లుండాలి. గత రెండు సీజన్లుగా హార్థిక్ నాలుగు లేదా ఐదో స్థానాల్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఏడో నెంబర్ లో బ్యాంగింగ్ కు రావాలనే వ్యూహం సరైందికాదు. అన్నీ తప్పులు చేయడం వల్లే గెలవాల్సిన మ్యాచులో ముంబై ఓడిపోయిందని షమీ కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఇది కూడా చదవండి: కొత్త రేషన్ కార్డులపై కీలక అప్‌డేట్..!

Latest News

More Articles