Saturday, April 27, 2024

ఈ నెల 27న యథావిధిగా సింగరేణి ఎన్నికలు

spot_img

హైదరాబాద్‌: ఈ నెల 27న సింగరేణి కాలరీస్‌లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు యథావిధిగా జరుగనున్నాయి. ఎన్నికల వాయిదా వేయాలన్న సంస్థ యాజమాన్యం దాఖలు చేసిన మధ్యంతర పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిందని, ఎన్నికల నిర్వహణకు కొంత సమయం ఇవ్వాలంటూ సంస్థ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.

Also Read.. తెచ్చిన అప్పులతో.. విద్యుత్‌ సరఫరా, ఉత్పత్తిని పెంచాం

ఈ నెల 17న దీనిపై విచారణ చేపట్టిన చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్ కుమార్‌ ధర్మాసనం కౌంటర్‌ దాఖలు చేయాలంటూ గుర్తింపు కార్మిక సంఘానికి నోటీసులు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలన్న మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

Latest News

More Articles