హైదరాబాద్: తనపై వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సభాపతిని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి కోరారు. యాదాద్రి ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందన్నది అవాస్తవమన్నారు. బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ సరఫరా నాణ్యతను పెంచామన్నారు. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందించామని చెప్పారు.
Also Read.. తెచ్చిన అప్పులతో.. విద్యుత్ సరఫరా, ఉత్పత్తిని పెంచాం
తమ హయాంలో అర ఎకరం కూడా ఎండలేదన్నారు. విద్యుత్పై ధర్నాలు చేసే అవకాశం మేం ఇవ్వలేదన్నారు. మా హయాంలో ఒక్క రోజు కూడా పవర్ హాలిడే ఇవ్వలేదని గుర్తు చేశారు. ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరికీ అప్పులు ఉంటాయని, అప్పులు ఉన్నంత మాత్రన మనందరం చెడ్డవాళ్లమా? అని ప్రశ్నించారు. అప్పులు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని జగదీశ్రెడ్డి సభకు తెలిపారు.