చదువుకొని, మంచి పొజిషన్లో ఉన్న కొందరు బెట్టింగ్ను వ్యసనంగా మార్చుకుంటున్నారు. అలా తమ జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువకుడు కూడా ఇలా బెట్టింగ్లో రూ.40 లక్షలు నష్టపోయాడు. చేసిన అప్పు తీర్చలేక.. భార్య, ఐదునెలల పసిపాపను ఒంటరి వాళ్లను చేసి చనిపోయాడు.
Read Also: కేటీఆర్ కీలక కామెంట్స్.. ORR, RRRకి మధ్యలో కొత్త హైదరాబాద్
రొంపిచర్ల మండలానికి చెందిన గంగిరెడ్డికి రెండేళ్ల క్రితం వివాహామైంది. అతనికి 5 నెలల పాప కూడా ఉంది. ఐటీ కొలువు చేసి.. భార్య, కూతురుతో హాయిగా గడుపుతున్నాడు. కాగా.. గంగిరెడ్డి కొంతకాలం కిందట బెట్టింగ్కు అలవాటుపడ్డాడు. క్రికెట్ బెట్టింగ్ చేస్తూ.. భారీగా నష్టపోయాడు. బెట్టింగ్ ద్వారా దాదాపు రూ.40 లక్షల వరకు అప్పు చేశాడు. దాంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. బలహీన క్షణంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకొని.. పల్నాడు జిల్లా సాతులూరు రైలు పట్టాలపై పడి చనిపోయాడు. భర్త చనిపోయాడని తెలిసి అతని భార్య, తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వారిని చూసి అక్కడున్న ప్రతీ ఒక్కరూ కంట తడి పెట్టారు.