సెంచురియన్: తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా ఆలౌట్ అయింది. యార్కర్ కింగ్ బుమ్రా చెలరేగడంతో 408 పరుగులకే సఫారీ జట్టు 9 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ తెంబ బవుమా బ్యాటింగ్కు రాకపోవడంతో.. టీ సెషన్కు ముందే ఆ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. ప్రస్తుతం సౌతాఫ్రికా జట్టు 163 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో రోజు ఓపెనర్ డీన్ ఎల్గర్ 185(287 బంతుల్లో 28 ఫోర్లు) క్రీజులో పాతుకుపోయాడు. మార్కో జాన్సేన్(84)తో కలిసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 2, శార్దుల్ ఠాకుర్, ప్రసిద్ధ్ కృష్ణ, అశ్విన్ తలో వికెట్ తీసుకున్నారు.
Temba Bavuma absent hurt means India will finally start their 2nd dig
Marco Jansen left stranded with his highest Test score – a knock that shows he's a GENUINE allrounder 💥https://t.co/d8VcaImuFx | #SAvIND pic.twitter.com/ljfSt15l21
— ESPNcricinfo (@ESPNcricinfo) December 28, 2023