Sunday, April 28, 2024

జపాన్ లో భూకంపం..ప్రమాదం నుంచి తప్పించుకున్న రాజమౌళి కొడుకు.!

spot_img

ఆర్ఆర్ఆర్ మూవీ స్క్రీనింగ్ లో భాగంగా దర్శకుడు రాజమౌళి ఆయన కుమారుడు కార్తీకేయ, చిత్ర నిర్మాత శోభూ యార్లగడ్డ ఇటీవల జపాన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. వారు బస చేసిన ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూప్రకంపనల వల్ల తాను భయాందోళనకు గురయ్యానని కార్తీకేయ ట్వీట్ చేయడంతో ఆయన ఫ్యాన్స్ అందోళనకు గురయ్యారు.

భూకంప అలర్ట్ కు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు కార్తీకేయ. జపాన్ లో ఇప్పుడే భూపకంపం వచ్చింది. నేను 28వ అంతస్తులో ఉన్నాను. భూమి కంపించడం చూసి కొద్ది క్షణాల్లో భూకంపం వచ్చిందని అర్థమైంది. నేను చాలా భయపడ్డాను కానీనా చుట్టూఉన్న జపాన్ వాసులు ఎలాంటి భయానికి గురికాలేదు. ఏదో వర్షం పడుతున్నట్లు ఏమాత్రం చలించలేదు. అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు స్క్రీనింగ్అయిపోయింది కదా ఇండియాకు వచ్చేయండి అని కామెంట్స్ పెడుతున్నారు. కాగా జపాన్లో ఈరోజు 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Latest News

More Articles