Friday, May 10, 2024

సుహాస్ కు జోడీగా కీర్తి సురేశ్..ఫ్యాన్స్ కు బిగ్ షాకే..!

spot_img

సుహాస్..కమెడీయన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. హీరోగా వరుసగా రెండు సూపర్ హిట్స్ కొట్టాడు. దీంతో సుహాస్ ఇండస్ట్రీలో మంచి డిమాండ్ వస్తోంది. హీరోగానే ఎక్కువగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్ కు మరో నేచురల్ స్టార్ దొరికాడు అంటున్నారు అభిమానులు. ఇప్పుడు సుహాస్ అందరికీ షాక్ ఇచ్చే వార్త చెప్పాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వార్త ఏంటంటే..సుహాస్ కు జోడీగా మహానటి కీర్తిసురేశ్ యాక్ట్ చేస్తోందట.

మహానటి మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకున్న కీర్తి సురేశ్..దసరా సినిమాతో దుమ్మురేపింది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలేమీ రాలేదు. కీర్తిసురేశ్ గతంతో పోల్చి చూస్తే సినిమా ఛాన్సులు తగ్గాయని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తెలుగులో బిజీగా మారాలని ఆమె ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం సుహాస్ కీర్తి సురేశ్ కాంబోలో ఒక సినిమా ఫిక్స్ అయిందని టాలీవుడ్ గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ డిజిటల్ సంస్థ…నిర్మిస్తోందని తెలుస్తోంది. తన టాలెంట్ తో సహాస్ ఉన్నత స్థాయికి ఎదుగుతూ వరుస విజయాలను అందుకుంటున్నాడు. ఆ టాలెంట్ ను గుర్తించి సుహాస్ కు మంచి ఆఫర్ ఇచ్చిందట అమెజాన్.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు మూవీతో సుహాస్ మరో సక్సెస్ ను తన అకౌంట్లో వేసుకున్న సంగతి తెలిసిందే. సుహాస్ కీర్తి సురేశ్ కాంబినేషన్ ప్రాజెక్టుకు ఉప్పుకప్పురంబు అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఐవి శశి డైరెక్షన్ లో ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ మూవీని నిర్మిస్తోంది. ముంబైలో జరిగిన ప్రైమ్ ఈవెంట్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడింది.

ఇది కూడా చదవండి: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి కిడ్నాప్..డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్.!

Latest News

More Articles