Friday, May 10, 2024

పెద్దగట్టు జాతరకు భారీగా నిధులు కేటాయింపు

spot_img

సూర్యాపేట : రాష్టంలో మేడారం తరువాత రెండవ అతిపెద్ద జాతరగా పేరొందిన సూర్యాపేట నియోజకవర్గం లోని దురాజ్ పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు ప్రభుత్వం భారీగా నిధులు రిలీజ్ చేసింది. వచ్చే నెల ఫిబ్రవరి 5నుండి  నుంచి 9వ తేదీ వరకు జరగనున్న ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరవుతుంటారు.

ఈ క్రమంలో జాతరను వైభవంగా నిర్వహించేందుకు స్థానిక సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ చూపించి జాతర చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా భారీ గా నిధులను విడుదల చేయించారు.

ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద గట్టు జాతరలో మౌలిక వసతులు, ఏర్పాట్లకుగాను రూ.5కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చరిత్రలో ఏనాడూ లేని విధంగా పెద్ద గట్టు జాతరకు 5 కోట్ల నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డిలకు యాదవ సంఘం పెద్దలు ధన్యవాదాలు తెలిపారు.

Latest News

More Articles