జపాన్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. భూకంప శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయట పడుతున్నాయి. ఇప్పటివరకు మరణాల సంఖ్య 62కు చేరింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు బయటపడే అవకాశం ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు.
కాగా జపాన్ లోని ఇషికావా నగరంలో సోమవారం 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలో మొత్తం 21 సార్లు భూప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంపాల ధాటికి జపాన్ అతలాకుతలం అయ్యింది. ఇప్పటికే 62 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.
ఇది కూడా చదవండి: సైబర్ మోసగాళ్ల నయా ఎత్తుగడ…ఏకంగా ట్రాఫిక్ పోలీసుల పేరుతో నకిలీ వెబ్ సైట్..!!