Saturday, May 4, 2024

నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు..!

spot_img

దేశంలో ఎన్నికల వాతావరణం మరింత హీటెక్కింది. ప్రతి పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని ప్రత్యర్థులపై విజయంసాధించి చట్ట సభల్లో అడుగుపెట్టాలన్న లక్ష్యంతో ప్రచారపర్వంతో హోరెత్తిస్తున్నాయి. లోకసభ, ఏపీలోని అసెంబ్లీ, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ కూడా దాఖలు చేయాల్సిన గడువు నేటితో ముగియనుంది. ఇప్పటి వరకు ప్రచారంలో బిజీబిజీగా ఉన్న నేతలంతా నామినేషన్ దాఖలు చేసేందుకు ఈ రోజు మాత్రమే గడువు ఉందని ఎన్నికల కమిషన్ మరోసారి గుర్తు చేసింది. శుక్రవారం నామినేషన్ల పరిశీలన ఉండగా..నామినేషన్ ల ఉపసంహర ఈనెల 29వ తేదీ వరకు గడువు ఉన్నట్లు ఈసీ తెలిపింది. వచ్చే నెల 13వ తేదీన ఏపీ, తెలంగాణ అసెంబ్లీ , లోకసభ ఎన్నిల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆరోజే ఫలితాలను విడుదల చేస్తారు.

కాగా దేశవ్యాప్తంలో లోకసభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలను నిర్వహిస్తోంది ఈసీ. అయితే పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు ఈరోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ రోజుతో నామినేషన్ పత్రాలు సమర్పించని వారు పోటీకి అనర్హులుగా మిగులుతారు. ప్రచారంలో బిజీగా ఉన్న నాయకులు నామినేషన్లు వేయాలంటూ మరోసారి ఈసీ గుర్తు చేసింది. అసెంబ్లీ ఎన్నికలను ప్రాంతీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. లోకసభ ఎన్నిలకపై జాతీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఈ హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ, ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కి చెందిన అగ్ర నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

ఇది కూడాచదవండి: ఉత్కంఠ పోరులో ఢిల్లీ గట్టెక్కిందోచ్..!

 

 

 

Latest News

More Articles