Saturday, April 27, 2024

వేసవి సెలవుల్లో..టీటీడీ దర్శక టికెట్లు పెంపు..!

spot_img

రానున్న వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ఉచిత సమయ నిర్దేశిత సర్వదర్శనం రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. శనివారం టీటీడీ డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం విలేకర్ల సమావేశంలోనూ ఈవో మాట్లాడారు.

వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో వీఐపీలకు, శ్రీవాణి టూరిజం, వర్చువల్ సేవలకు కేటాయించే టికెట్లను తగ్గించి ఎస్ఎస్ డీ , ఎస్ఈడీ టికెట్ల కోటా పెంచుతామని ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో సిఫార్సు లేఖలను అనుమతించమన్నారు. వీఐపీ  బ్రేక్ దర్శనాల కోటా ఉండదని వెల్లడించారు. ఈనెల 8న గోగర్భతీర్థంలో క్షేత్ర పాలకుడికి మహాశివరాత్రి పర్వదినాన్ని 20 నుంచి 24 వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలను , 25న తుంబర తీర్థ ముక్కోటిని నిర్వహించనున్నట్లు చెప్పారు. ఫిబ్రవరిలో 19.06 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా.రూ. 111.71కోట్ల హుండీ కానుకలు లభించినట్లు ఈవో తెలిపారు.

ఇది కూడా చదవండి: నేడు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో.!

Latest News

More Articles