ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ కారు బీభత్సం సృష్టించింది. మితివీగిన వేగంతో దూసుకొచ్చిన కారు రంగారెడ్డి జిల్లా నార్సింగి దగ్గర అదుపుతప్పి ఓఆర్ఆర్పై నుంచి కింద పడింది. దీంతో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఘటనా స్థలంలో ఒకరు మరణించగా…ఆసుపత్రికి తరలిస్తుంగా మరొకరు చనిపోయారని పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: కరీంనగర్లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన గ్యాస్ సిలిండర్లు..!!