Thursday, May 2, 2024

ఉస్మానియా ఆసుపత్రిలో కరోనాతో ఇద్దరి మృతి

spot_img

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో గత ఇరవై నాలుగు గంటల్లో 412 కరోనా కేసులు నమోదు కాగా… ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో తాజాగా కొవిడ్ మృతి కేసులు నమోదయ్యాయి. అనారోగ్యం కారణంగా ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చేరారు. సమస్య తీవ్రతరం కావడంతో ఇద్దరూ మృతి చెందారు. మృతి చెందినవారిలో ఒకరికి 60 ఏండ్లు, మరొకరికి 40 ఏండ్లు ఉన్నాయి. మృతులకు పరీక్షలు నిర్వహించగా కొవిడ్ పాజిటివ్ గా తేలింది. అంతే కాదు ఇక్కడే ఇద్దరు పీజీ డాక్టర్ లకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.

Latest News

More Articles