Sunday, April 28, 2024

బస్సులు ఆపట్లేదు.. చులకనగా చూస్తుర్రు.. ఫ్రీ బస్సుపై మహిళల ఆగ్రహం

spot_img

ఫ్రీ బస్సు లేకున్నా మంచిదే.. ఎందుకిట్ల మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ మహిళలు. ఫ్రీ బస్ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి మహిళలను ఆర్టీసీ సిబ్బంది చులకనగా చూస్తున్నారంటూ.. మహిళలు మండిపడుతున్నారు. మహిళలు కనిపిస్తే చాలు.. బస్సులో జనాలు ఉన్నా లేకున్నా ఆపకుండా వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహిళలు. ఇప్పుడు దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం కటికనపల్లి గ్రామానికి చెందిన ఈ మహిళ మాటలు కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటిస్తున్నాయి. నాకు ఫ్రీ టికెట్ అవసరమే లేదు. నేను పైసల్ కూడా తెచ్చుకున్నా. అయినా బస్సు ఆపకుండా దంచుకపోయిండు. మమ్మల్ని ఈ ప్రభుత్వం బిచ్చగాళ్ళని చేసింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో.. అక్కడే ఉన్న మిగతా మహిళలు కూడా ఆమెతో స్వరం కలిపారు.

Latest News

More Articles