వరంగల్ జిల్లా : పర్వతగిరి మండలం అన్నారం చెరువులో 6 నెలల పసికందు మృతదేహం లభ్యమైంది. మృతుడు మిల్స్ కాలనీకి చెందిన తన్నూముర్ (6నెలలు)గా గుర్తించారు పోలీసులు. నాలుగు రోజుల క్రితం తల్లీ తస్లిమా సుల్తానా (20 సం), కొడుకు తన్నూముర్ కనిపించడం లేదని మిస్సింగ్ కేసు నమోదు అయింది. రెండు రోజుల క్రితం తస్లిమా మృతదేహం లభ్యం కాగా, ఈరోజు కొడుకు తన్నూముర్ మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. మిస్సింగ్ కేసులో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని శనివారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందు మృతురాలి బందువులు ఆందోళన చేసారు.
Also Read.. బస్సులు ఆపట్లేదు.. చులకనగా చూస్తుర్రు.. ఫ్రీ బస్సుపై మహిళల ఆగ్రహం