Monday, May 6, 2024

ఆర్టీసీ కండక్టర్లపై దాడి.. యువతికి 14 రోజుల రిమాండ్‌

spot_img

హైదరాబాద్‌: ఇటీవల ఆర్టీసీ కండక్టర్లపై దాడికి పాల్పడిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితురాలైన అంబర్‌పేటకు చెందిన సయ్యద్‌ సమీనాను ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు సమీనాకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ సందర్భంగా పోలీసులకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. అంబర్‌పేటకు చెందిన సమీనా బేగం ఇటీవల హయత్‌ నగర్‌ డిపో-1కు చెందిన బస్సులో వెళ్లింది. ఈ క్రమంలో చిల్లర విషయంలో కండక్టర్‌తో గొడవపడింది. అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించి దాడికి పాల్పడింది. చంపేస్తానంటూ కండ‌క్టర్‌ను బెదిరించింది. ఇదే సమయంలో ఆమెను నిలువ‌రించేందుకు యత్నించిన మ‌రో మ‌హిళా కండ‌క్టర్ పై కూడా దాడి చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. దీంతో టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం సదరు యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read.. పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి లేదు

Latest News

More Articles