Friday, May 10, 2024

పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి లేదు

spot_img

పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. రేవంత్ టీడీపీలో ఉన్నప్పుడు దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు. హామీలు అమలు చేయలేక సాకులు చెబుతున్నారని హరీశ్ రావు విమర్శించారు. ఎన్నికల హామీలు అమలు చేశాకే లోక్ సభ ఎన్నికల్లో ఓటు అడగాలని డిమాండ్ చేశారు.

ఇవాళ(ఆదివారం) హైదరాబాదులో జరిగిన బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు.ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. అసెంబ్లీలో దిమ్మదిరిగే జవాబు ఇస్తామని అన్నారు. నాడు కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతకు తాము ఒప్పుకున్నట్టు రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.

ఇప్పుడు కేంద్రం ఒత్తిడితో ప్రాజెక్టుల అప్పగింతకు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఒప్పుకుందని ప్రత్యారోపణలు చేశారు. విభజన చట్టం బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు హరీశ్ రావు.

ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి..గాడిదకు రంగేసినంత మాత్రాన సింహంగా మారదు

Latest News

More Articles