Sunday, April 28, 2024

చిరంజీవి కోసం.. బెంగుళూరు నుండి హైదరాబాద్ కి స్టార్ హీరో

spot_img

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం ద‌క్కిన విష‌యం తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమకు చిరు అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్ర‌క‌టించింది. ఇక మెగాస్టార్‌కు పద్మవిభూషణ్ దక్కడంతో ఫ్యాన్స్‌తో పాటు సినీ సెలబ్రిటీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంతోమంది సెలబ్రిటీలు.. అవార్డ్ ప్రకటన జరగగానే చిరును ఇంటికి వెళ్లి కలిసి వచ్చారు.

అయితే తాజాగా క‌న్న‌డ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా చిరంజీవిని క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపాడు. ఆదివారం ఉద‌యం హైదరాబాద్‌లోని చిరంజీవి ఇంటికి చేరుకున్న శివన్న మెగాస్టార్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి పద్మవిభూషణ్ రావ‌డం ప‌ట్ల శుభాకాంక్షలు తెలిపారు. అనంత‌రం వీరిద్దరూ కలిసి భోజనం చేశారు. అయితే ఈ విష‌యాన్ని చిరంజీవి సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలుపుతూ స్పెష‌ల్ పోస్ట్ పెట్టాడు.

”నాకు శుభాకాంక్షలు తెల‌ప‌డానికి శివరాజ్ కుమార్ బెంగళూరు నుంచి రావడం నా మనసుని హత్తుకుంది. తనతో కలిసి సమయం గడపడం, కలిసి భోజ‌నం చేస్తూ రాజ్‌కుమార్‌తో వారి కుటుంబంతో మాకు ఉన్న అనుబంధాలని గుర్తుచేసుకోవ‌డం ఆనందాన్ని ఇచ్చింది”. అంటూ చిరు రాసుకోచ్చాడు.

Latest News

More Articles