Thursday, May 2, 2024

క్యాడ్‌బరీ చాక్లెట్‌లో పురుగులు,పిల్లలు జరభద్రం.!

spot_img

సూపర్ మార్కెట్లో కొనుగోలు చేసిన చాక్లెట్స్ లో పురుగులు కనిపించడం ఓ కొనుగోలుదారుడిని విస్మయానికి గురిచేసింది. నగరానికి చెందిన రాబిన్ విజయ్ కుమార్ ఈనెల 9న క్యాడ్ బరీ చాక్లెట్స్ కొనుగోలు చేశాడు. కాగితం తెరిచి చూడగానే పురుగులు కనిపించాయి. దీంతో విస్మయానికి గురైన విజయ్ కుమార్ ఈ విషయాన్ని వెంటనే బల్దియా అధికారులకు తెలియజేశాడు. ఈ చాక్లెట్ ను తెలంగాణ రాష్ట్రల్యాబరెటరీలో పరీక్షించారు. అందులో పురుగులు, వలలు ఉన్నట్లు గుర్తించారు. క్యాడ్ బరీ డైరీ మిల్క్ చాక్లెట్స్ తినడంసురక్షితం కాదని..వీటికి దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి : డ్రగ్స్ కేసు..శుక్రవారం విచారణకు దర్శకుడు క్రిష్.!

Latest News

More Articles