Tuesday, April 30, 2024

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

spot_img

గుజరాత్‌లోని అహ్మదాబాద్-వడోదరా ఎక్స్‌ప్రెస్ వేలో ఇవాళ(బుధవారం) ఒక ట్రెయిలర్ ట్రక్కును కారు ఢీకొన్న ప్రమాదంలో 10 మంది మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ట్రెయిలర్ ట్రక్కును వెనుకనుంచి కారు వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. వడోదర నుంచి అహ్మదాబాద్‌కు వెళుతున్న కారులో ఉన్న 10 మంది ప్రయాణికులు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్సులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాయి. కారులోని 8 మంది ఘటనా స్థలంలోనే మరణించగా మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారని పోలీసులు తెలిపారు. ప్రమాదం కారణంగా ఎక్స్ ప్రెస్ వే లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి:కాంగ్రెస్ ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త వ‌ల్లే గురుకుల విద్యార్థి ప్ర‌శాంత్ మృతి

 

Latest News

More Articles